కోళ్లఫారం నుంచి ఆ ఇద్దరు మిస్సింగ్.. కలిసే వెళ్లారా..?

by  |
కోళ్లఫారం నుంచి ఆ ఇద్దరు మిస్సింగ్.. కలిసే వెళ్లారా..?
X

దిశ, చేవెళ్ల: కోళ్ల ఫారంలో పనిచేసే ఇద్దరు కూలీలు కనిపించకుండాపోవడం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టిస్తున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకమ్మ గూడ గ్రామానికి చెందిన మల్లేష్ (30), వరంగల్ జిల్లా కొరివి మండలం తట్టె పల్లి గ్రామానికి చెందిన రమ (33) ఇద్దరు వెంకమ్మ గూడ గ్రామంలోని రత్న పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 17వ తేదీన పని ముగించుకొని ఇంటికి రావాల్సిన మల్లేష్ ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాప్ రావడంతో ఆయన భార్య మంజుల తెలిసిన వాళ్ళకు, బంధువులను విచారించినా ఫలితం లేదు. ఇక ఈ క్రమంలోనే అదే రోజు రమ కూడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరి కోసం వెతికి వెతికి ఇరు కుటుంబాలకు చెందిన వారు గురువారం షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు. ఇద్దరు ఒకేరోజు కనిపించకపోవడంతో.. కలిసే వెళ్ళారా..? లేక ఇంకేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.



Next Story

Most Viewed