ఏపీ-తెలంగాణ సరిహద్దులో విషాదం..

by  |
ఏపీ-తెలంగాణ సరిహద్దులో విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ, తెలంగాణ సరిహద్దులో తీవ్ర విషాదం నెలకొంది. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరు కరోనా రోగులు చికిత్సకు దూరమై మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వచ్చే అంబులెన్సులను టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకోవడం వల్లే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.

అంతకుముందు టోల్‌ప్లాజా పోలీసులతో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అంబులెన్సులను తెలంగాణ పోలీసులు మళ్లీ వెనక్కి పంపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అంబులెన్సులు ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలోనికి రాకుండా తీసుకొచ్చిన సర్క్యూలర్ పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed