విషాదం: వంతెనపై నుంచి సిమెంట్ లారీ బోల్తా

by  |
విషాదం: వంతెనపై నుంచి సిమెంట్ లారీ బోల్తా
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. డిండి మండలం చెరుకుపల్లి గేటు సమీపంలో వంతెన పైనుంచి సిమెంట్ లారీ బోల్తా పడటంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వెంకటేశ్వర్లు, నరసింహారావుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిమెంట్ లారీ దేవరకొండ నుంచి డిండి వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Next Story