స్మగ్లర్ల సజీవదహనం కేసులో ట్విస్ట్

by  |
స్మగ్లర్ల సజీవదహనం కేసులో ట్విస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్ :
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని మరో గ్యాంగ్ ఛేజ్ చేసింది. ఎర్రచందనం దుంగలను లాక్కునేందుకు బాషాభాయ్ అనే గ్యాంగ్ యత్నించింది. ఈ క్రమంలో టయోటా వాహనంలో కారును బాషాభాయ్ గ్యాంగ్ వెంబడించింది. స్కార్పియో వాహనాన్ని ఛేజ్ చేస్తుండగా టిప్పర్ ను ఢీకొని వాహనం తగలబడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి బాషా గ్యాంగ్ పరారైంది. కేసు నమోదు చేసిన పోలీసులు బాషాభాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed