ఒకేసారి అందరి ఇళ్లలో కాలిపోయిన టీవీలు, ఫ్యాన్లు.. ఎక్కడంటే?

by  |
tvs-and-fans1
X

దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం స్టేట్ బ్యాంకు వద్ద గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ కు మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ లోఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో పలువురి ఇళ్లల్లో టీవీలు, ఫ్యాన్లు, విద్యుత్ బల్బులు కాలిపోయాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో పలుసార్లు ఏర్పడ్డ విద్యుత్ అంతరాయం వల్ల టైల్స్ వేసే కట్టర్ మిషన్ పెద్ద శబ్దంతో కాలిపోయిందని, ఈ సమయంలోనే పలువురి ఇళ్లల్లో టీవీలు, ఫ్యాన్లు, విద్యుత్ బల్బులు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, దీనిపై విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

Next Story