టీఎస్ ఈసెట్ ఎగ్జామ్.. కండిషన్ అప్లై!

by  |
టీఎస్ ఈసెట్ ఎగ్జామ్.. కండిషన్ అప్లై!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పరీక్షల హడావుడి మళ్లీ మొదలైంది. కరోనా వ్యాప్తి ప్రభావంతో ఇన్నిరోజులుగా వాయిదా పడుతూ వచ్చిన పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సోమవారం టీఎస్ ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుండగా.. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్ట్ సెషన్.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సెకండ్ సెషన్ జరగనుంది.

అయితే, పరీక్షా సెంటర్లో ఉన్నంత సేపు తప్పకుండా మాస్క్ ధరించే ఉండాలని అధికారులు నిబంధనలు పెట్టారు. టీఎస్ ఈసెట్ నిర్వహణ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఈసెట్ కన్వీనర్ ఎం.మంజూర్ హుస్సేన్ ప్రకటించారు.


Next Story

Most Viewed