ఎంసెట్ ఫలితాలు విడుదల….

by  |
ఎంసెట్ ఫలితాలు విడుదల….
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్)‌లో 75.29 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,183 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా వీరిలో 89,734 మంది అర్హత సాధించారు. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

కాగా అక్టోబర్ 9 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. అక్టోబర్9 నుంచి 12 వరకు ఆన్ లైన్ స్లాట్ల నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed