బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్

by  |
బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్
X

దిశ, జగిత్యాల: సీఎం కేసీఆర్ ఆది నుంచి కేంద్రం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఫలితంగా నేడు కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రైతే రాజు కావాలన్న లక్ష్యంతో రాష్ట్ర సర్కారు పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులను కూలీలుగా మార్చే చట్టాలను తెచ్చిందని, గురునానక్ జయంతి రోజున అటువంటి చట్టాలను రద్దు చేయడం రైతు విజయమని ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రద్దు చేసిన చట్టాలపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్‌లు అవగాహన కల్పించి.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed