రామారెడ్డి టూ ఇందిరాపార్క్‌కు టీఆర్ఎస్ నేతలు

by  |
nzb-dharna-1
X

దిశ, రామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిఒడ్డున ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన మహధర్నాకు కామారెడ్డి జిల్లా రామారెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేస్తుందా లేదా స్పష్టమైన హమీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ధర్నా నిర్వహించడంతో పెద్ద ఎత్తున తరలివెళ్తున్నట్లు నాయకులు తెలిపారు. తరలివెళ్లినవారిలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ఎంపీపీ దశరత్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు గురిజాల నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సభ్యులు కాసర్ల రాజేందర్, డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్, సర్పంచ్ లు సంజీవ్, రాంరెడ్డి, గిద్ద ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్ నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed