ఓటీటీ రిలీజ్.. త్రిష ల్యాండ్ మార్క్ సినిమా

by  |
ఓటీటీ రిలీజ్.. త్రిష ల్యాండ్ మార్క్ సినిమా
X

దిశ, సినిమా : ఎవర్ గ్రీన్ హీరోయిన్ త్రిష ‘పేటా, కార్తీక్ డయల్ సెయతా యాన్’ సినిమాల తర్వాత ప్రేక్షకులకు కనిపించలేదు. కొవిడ్ పరిస్థితుల కారణంగా ఆమె నటించిన చిత్రాలేవీ విడుదల కాలేదు. అయితే కొవిడ్ టైమ్‌లోనే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటించిన ఈ భామ.. ప్యారలల్‌గా ‘పరమపాదం విలయట్టు’ మూవీలోనూ లీడ్ రోల్ ప్లే చేసింది. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా, కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఈ మూవీని ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నట్లు ఈ రోజు (ఆదివారం) అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు మేకర్స్. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను ఈ నెల 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ కె.తిరుజ్ఞానం తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న చిత్రంలో త్రిష ఓ ఫేమస్ పొలిటికల్ లీడర్‌కు వైద్యం చేసే డాక్టర్‌గా కనిపించనుందని తెలుస్తోంది.స్మైలింగ్ క్వీన్ త్రిష 60 వ చిత్రం ‘ఓటీటీ’ వేదికగా రిలీజ్ కావడం విశేషం. ఈ చిత్రం త్రిష కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.



Next Story

Most Viewed