వివాదంలో హీరోయిన్ త్రిష.. ఆలయంలో అలా కనిపించడంతో

by  |
వివాదంలో హీరోయిన్ త్రిష.. ఆలయంలో అలా కనిపించడంతో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ త్రిష మరో వివాదంలో చిక్కుకున్నారు. దేవుళ్ల విగ్రహాలు ఉన్న ప్రాంతానికి త్రిష చెప్పులు వేసుకుని వచ్చిందని హిందూ సంఘం నేతలు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా హిందువుల మనోభవాలను దెబ్బతీసారంటూ త్రిష, దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఇండోర్‌లో జరుగుతోంది.

ఒక దేవాలయంలో జరుగుతున్న ఈ షూటింగ్ సెట్ లో త్రిష చెప్పులు వేసుకొని తిరగడం సంచలనంగా మారింది. త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. దేవుళ్ల విగ్రహాల మధ్య చెప్పులు వేసుకొని నడవడమేంటి..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన త్రిష, అలాంటి సన్నివేశాలను చిత్రీకరించిన మణిరత్నంపై హరికేష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed