ఆమనగల్లులో బిపిన్ రావత్‌కు నివాళులు

by  |
Bipin-Rawath1
X

దిశ, ఆమనగల్లు: హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తోపాటు మిగతావారికి ఏబీవీపీ నాయకులు శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై నివాళులు అర్పించారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు అయన సతీమణి మధులిక రావత్ కూడా ఉన్నారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొతులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్, ఏబీవీపీ నగర కార్యదర్శి గోరటి భరత్, నాయకులు శివ, లండం మల్లేష్, మొక్తల సాయి, సురేష్, అంజి, సాయి, రేవల్లి రాజు, ఎర్రవోలు మహేష్, పాతకోట శ్రీశైలం, ఆనంద్, శ్రీను, సతీష్, మహేష్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed