నాయిని గొప్ప కార్మిక నాయకుడు !

by  |
నాయిని గొప్ప కార్మిక నాయకుడు !
X

దిశ, ముషీరాబాద్: మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గొప్ప కార్మిక నాయకుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నేత కందూరు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలో నాయిని నరసింహారెడ్డి, అహల్య దంపతుల శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని దంపతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నాయిని చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. నాయిని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు.


Next Story

Most Viewed