- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబాజిపేట్ తాండలో అటవి అధికారులపై గిరిజనులు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. ముంబాజిపేట్ అటవి ప్రాంతంలో గిరిజనులు ట్రాక్టర్లతో అటవి భూమిని చదును చేయడానికి వెళ్లారు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్లు ఫిరోజ్ ఖాన్, మహేష్ లు అక్కడికి వెళ్లి వారిని అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన గిరిజనులు వారిపై దాడి చేశారు. అక్కడే ఉన్న మరో అధికారి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారుల పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో కొండాపూర్ శివారులో గిరిజన దాడిలో గాయపడిన బీట్ ఆఫీసర్లను డిఎఫ్ వో నిఖిత, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరామర్శించారు.