ఫారెస్ట్ అధికారుల పై గిరిజనుల దాడి.. తీవ్ర గాయాలతో..

by  |
ఫారెస్ట్ అధికారుల పై గిరిజనుల దాడి.. తీవ్ర గాయాలతో..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబాజిపేట్ తాండలో అటవి అధికారులపై గిరిజనులు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. ముంబాజిపేట్ అటవి ప్రాంతంలో గిరిజనులు ట్రాక్టర్లతో అటవి భూమిని చదును చేయడానికి వెళ్లారు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్లు ఫిరోజ్ ఖాన్, మహేష్ లు అక్కడికి వెళ్లి వారిని అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన గిరిజనులు వారిపై దాడి చేశారు. అక్కడే ఉన్న మరో అధికారి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారుల పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో కొండాపూర్ శివారులో గిరిజన దాడిలో గాయపడిన బీట్ ఆఫీసర్లను డిఎఫ్ వో నిఖిత, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరామర్శించారు.

Next Story

Most Viewed