Trending: కుంభమేళాలో చనిపోతే మోక్షం.. బిహార్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఉత్తర్‌ప్రదేశ్ (Uttar PradesH) రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ (Prayagraj) వేదికగా జరుగుతోన్న కుంభమేళాలో చనిపోతే మోక్షం లభిస్తోందని బిహార్ (Bihar) స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ (MP Pappu Yadav) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Trending: కుంభమేళాలో చనిపోతే మోక్షం.. బిహార్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar PradesH) రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ (Prayagraj) వేదికగా జరుగుతోన్న కుంభమేళాలో చనిపోతే మోక్షం లభిస్తోందని బిహార్ (Bihar) స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ (MP Pappu Yadav) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. త్రివేణి సంగమం (Triveni Sangam) ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 600 మంది వరకు చనిపోయారని ఆయన ఆరోపించారు. కనీసం వారికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh) అంత్యక్రియలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారు మోక్షం పొందారని ఒక బాబా చెప్పారని.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanath)ను ఉదేశించి పప్పు యాదవ్ కామెంట్ చేశారు.

కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela)లో గత నెల 30 తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mouni Amavasya) సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. మౌని అమావాస్య (Mouni Amavasya)ను పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని (Prayagraj) త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సెక్టార్-2 ప్రాంతంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మృతి కుంభమేళాలో చనిపోతే మోక్షం.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలుచెందిన బాధిత కుటుంబాలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Next Story