- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : ఆఫీసుకు వస్తే సరిపోదు, రన్నింగ్ చేస్తేనే సాలరీ అండ్ బోనస్..! ఓ కంపెనీ వినూత్న ప్రకటన
Viral : ఆఫీసుకు వస్తే సరిపోదు, రన్నింగ్ చేస్తేనే సాలరీ అండ్ బోనస్..! ఓ కంపెనీ వినూత్న ప్రకటన

దిశ, ఫీచర్స్ : ఏ కంపెనీలైనా తమ ఉద్యోగులు బాగా పనిచేస్తేనే జీతంతోపాటు ఇంక్రిమెంట్లు, బోనస్లు వంటివి ఇస్తామని చెబుతుంటాయి. కానీ చైనాలోని ‘గ్వాంగ్ డాంగ్, డాంగ్పో’ పేపర్ కంపెనీ మాత్రం అందరూ ఆశ్చర్యపోయే ప్రకటన చేసింది. ‘రన్నింగ్ చేయండి, ఫిట్గా ఉండండి, జీతంతోపాటు బోనస్ పొందండి’ అంటూ ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
రన్నింగ్కు బోనస్కు లింక్ పెట్టడం వెనుక తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటమే అసలు ఉద్దేశమని గ్వాంగ్ డాంగ్, డాంగ్పో కంపెనీ యాజమాన్యం పేర్కొన్నది. ఇక బోనస్ ఇచ్చే విషయానికి వస్తే, ఉద్యోగులు నెలకు 100 కిలోమీటర్లు (సుమారు 62 మైళ్లు) పరిగెత్తితే, వారికిచ్చే సాలరీలో 130% బోనస్గా పొందవచ్చు. 50 కిలోమీటర్లు (31 మైళ్లు) పరిగెత్తితే 100% బోనస్, 40 కిలోమీటర్లు పరిగెత్తితే 60% బోనస్, 30 కిలోమీటర్లు పరిగెత్తితే 30% బోనస్ లభిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇంతకంటే తక్కువ పరిగెత్తిన వారికి అసలు బోనసే ఉండదు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా, ఇది సరైంది కాదని కొందరు, ఉద్యోగుల ఆరోగ్యం గురించి ఆలోచించడం గ్రేట్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.






