దశల వారీగా రైళ్ల పెంపు.. ఎంఎంటీఎస్‌‌పై వీడని సస్పెన్స్

by  |
దశల వారీగా రైళ్ల పెంపు.. ఎంఎంటీఎస్‌‌పై వీడని సస్పెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంతో పాటుగా ఇతర ప్రాంతాలకు దశలవారీగా రైళ్లను పెంచుతున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ వెల్లడించారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. కరోనాకు ముందు నడిచే రైళ్లలో ప్రస్తుతం 70 శాతం నడుస్తున్నాయన్నారు. సిక్రిందాబాద్​పరిధిలో సుమారు 300 రైళ్లకు గానూ 215 రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 140 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి నడుస్తున్నాయన్నారు. ఏప్రిల్ 1నుంచి కొన్ని రైళ్లు పెంచుతున్నామని, ఇవన్నీ సికింద్రాబాద్‌ జోన్ నుంచి వెళ్తాయని తెలిపారు. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరనపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. సికింద్రాబాద్-కర్నూల్‌సిటీ, బీదర్-హైదరాబాద్, కాచిగూడ-రేపల్లె, గుంటూరు-వికారాబాద్, గుంటూరు-విశాఖపట్నం రైళ్లు ఏప్రిల్​1 నుంచి నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు.

పలు రైళ్లు క్యాన్సిల్..

సిగ్నల్, ఎలక్ట్రికల్​మరమ్మతుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు సౌత్​సెంట్రల్​రైల్వే వెల్లడించింది. ఈ నెల 4, 7, 11 తేదీల్లో కరీంనగర్-తిరుపతి (02762) రైలును రద్దు చేశారు. తిరుపతి-కరీంనగర్​రైలును సైతం రద్దు చేశారు. తిరుపతి-విశాఖపట్నం (02707) రైలును ఈ నెల 5, 7, 10, 12 తేదీల్లో, సికింద్రాబాద్-తిరుపతి (02770) రైలును ఈ నెల 5, 9 తేదీల్లో, తిరుపతి-పూరీ (07479) రైలును ఈ నెల 5, 6, 8, 9, 10, 12 తేదీల్లో రద్దు చేసినట్టు ప్రకటించింది. భువనేశ్వర్-తిరుపతి (08479) రైలును ఈ నెల 6న, తిరుపతి-అమరావతి (02765) రైలును ఈ నెల 6, 9 తేదీల్లో, తిరుపతి-బిలాసాపూర్​ (07481) రైలును ఈ నెల 7, 11 తేదీల్లో, తిరుపతి-భువనేశ్వర్​(02072) రైలును ఈ నెల 8న, తిరుపతి-కొల్హాపూర్​(07415) రైలును ఈ నెల 11న రద్దు చేశామని, తిరుగు రైళ్లు సైతం ఉండవని సౌత్ సెంట్రల్​ రైల్వే ప్రకటించింది. కడప-విశాఖపట్నం రైలు ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతిలో ఆగదని, నాగర్‌సోల్-శాలిమార్, రామేశ్వరం-ఓకా, యశ్వంతపూర్-తంతానగర్, యశ్వంత్​పూర్-హాతియా రైళ్లను రేణిగుంట మీదుగా డైవర్ట్​చేయనున్నట్టు పేర్కొంది.


Next Story

Most Viewed