- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి మధ్యాహ్నం తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరంలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 3.30 కి బర్డ్ ఆస్పత్రికి వెళతారు. చిన్న పిల్లల కోసం ఏర్పాటుచేసిన హాస్పటల్ ను ప్రారంభిస్తారు. అలిపిరి వద్ద దాతలు నిర్మించిన నిర్మాణాలను ప్రారంభిస్తారు.
నడక మార్గం ద్వారా స్వామి వారి ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం 5.30 కి తిరిగి శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు.
కొత్తగా నిర్మించిన బూందీపోటును ప్రారంభించి, అన్నమయ్య భవన్ కు వెళతారు. తర్వాత రైతు సాధికార సంస్థ, టీటీడీ కి జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత తిరుపతి విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.