పీడిత ప్రజల పక్షపాతి లింగన్న

by  |
పీడిత ప్రజల పక్షపాతి లింగన్న
X

దిశ, దుబ్బాక: పీడిత, తాడిత ప్రజల పక్షపాతిగా నిలబడి, తుది శ్వాస వదిలేంతవరకు సమసమాజ నిర్మాణం కోసం పరితపించిన గొప్ప వ్యక్తిత్వం లింగన్నదని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన రాయపోలులో జరిగిన రామలింగారెడ్డి సంతాపసభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.

లింగన్న ఆకస్మిక మృతి లక్షలాది పేద ప్రజలకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ ప్రజాప్రతినిధిని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కోల్పోవడం దురదృష్ట కరమన్నారు.

కుటుంబ సభ్యుల పరామర్శ

దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను విరాహత్ అలీ పరామర్శించి, భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డిలను ఓదార్చారు. ఆ కుటుంబానికి తాము వెన్నంటి ఉండి ఆయన లక్ష్య సాధనకుపాటు పడతామన్నారు.

Next Story