రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్ దొంగలు

by  |
రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్ దొంగలు
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలోని పామర్రులో చైన్ స్నాచింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. గొల్వేపల్లిలో ఓ మహిళ మెడలో రెండున్నర కాసుల బంగారు గొలుసును అపహరించగా, పామర్రు శివాలయం వద్ద మరో మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు. ఆ మహిళ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. గొలుసు అపహరణపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story