మావోయిస్టుల ఘాతుకం.. ముగ్గురు జవాన్లు మ‌ృతి

by  |
bomb blast
X

దిశ వెబ్ డెస్క్ : జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను హెలికాప్టర్‌లో రాంచీ ఆస్పత్రికి తరలించారు. కూంబింగ్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలినట్టు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఆ ప్రాంతంలో మావోలు ఇంకా మందుపాతరలు అమర్చారేమో అన్న అనుమానంతో అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

Next Story