ముగ్గురు చిన్నారులు అదృశ్యం

by  |
ముగ్గురు చిన్నారులు అదృశ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవులపల్లి నేతాజీ నగర్‌లో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఆడుకోవడం కోసం బయటకు వెళ్లిన చిన్నారులు ఎంతకీ ఇంట్లోకి రాకపోవడంతో, తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా వారు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తప్పిపోయిన చిన్నారులు నందు, వెంకటమ్మ, తరుణ్‌లు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

Next Story

Most Viewed