నయీమ్ గ్యాంగ్ పేరుతో.. ఇంటి గోడలపై రాతలు

by  |
నయీమ్ గ్యాంగ్ పేరుతో.. ఇంటి గోడలపై రాతలు
X

దిశ, ఘట్ కేసర్ : ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఉంటున్న ఇంటి గోడలపై నయీం గ్యాంగ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు రాతలు రాసి తమను, తమ తల్లిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని బ్రూక్ బాండ్ కాలనీలో 8-104 నంబర్ గల ఇంటిలో 80ఏళ్ల వృద్ధురాలు పుష్పవతి నివాసం ఉంటున్నారు.

అదే ఇంటి గోడలపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు నయీమ్ గ్యాంగ్ పేరుతో ‘‘ఈ ఇల్లు అమ్మబడదు.. కోర్టు కేసులో ఉంది..’’ అని రాసినట్లు, తమకు రక్షణ కల్పించి, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పుష్పవతి కొడుకు శ్రీధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story

Most Viewed