ఈ పుట్టిన రోజును మర్చిపోలేను.. ఎమ్మెల్సీ కవిత

by  |
ఈ పుట్టిన రోజును మర్చిపోలేను.. ఎమ్మెల్సీ కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. మా అమ్మ, అన్నయ్య సంతోష్‌లతో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని కవిత తెలిపారు. శనివారం తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రగతి భవన్‌లో ఆమె మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఆమె తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్నారని సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనతో మొక్కలు నాటించి తన పుట్టిన రోజుకు మంచి బహుమతి అందించారని కొనియాడారు. ఇది ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకంగా ఉంటుందన్నారు.



Next Story