ఆ కేసులో ఉగ్రకోణం లేదు

by  |
ఆ కేసులో ఉగ్రకోణం లేదు
X

ముంబయి: జనవరి 29న న్యూఢిల్లీలో ఇజ్రాయిల్ రాయభార కార్యాలయం బయట జరిగిన పేలుళ్లకు, గత నెల 25న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటివద్ద బాంబుల కలకలం కేసుకు ఎలాంటి లింక్ లేదని మహారాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ రెండు కేసుల్లో తమ హస్తం ఉన్నట్టు జైషే ఉల్ హింద్ అనే సంస్థ పేరిట మెసేజ్‌లు వెలుపడ్డాయి.

కాగా వాటిని పోలీసులు కొట్టిపడేశారు. ఆ సంస్థ ఉనికిలో లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుళ్ల కేసులో ఉగ్రకోణం లేదని తేల్చి చెప్పారు. అదో కల్పిత మెసేజ్ అని.. ప్రజల దృష్టిని మరల్చడానికే ఆ మెసేజ్ కొందరు పంపి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.


Next Story

Most Viewed