నడిరోడ్డుపై దోపిడి దొంగల హల్‌చల్.. ఫ్యామిలీకి కత్తిపోట్లు!

by  |
నడిరోడ్డుపై దోపిడి దొంగల హల్‌చల్.. ఫ్యామిలీకి కత్తిపోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దారి దోపిడి దొంగలు బరితెగించారు. మహరాష్ట్రలోని శిరిడి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగివస్తున్న కుటుంబంపై దోపిడి దొంగలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక వాసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. తొలుత కారును అడ్డగించిన దొంగలు మారణాయుదాలతో విరుచుకపడ్డారు. బాధితుల నుంచి 8తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారును వేగంగా డ్రైవ్ చేయడంతో అదుపుతప్పి వాహనం బోల్తా కొట్టింది.

ఈ దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బండవేలికిచర్ల గ్రామానికి చెందిన రాములు కుటుంబంగా గుర్తించారు. దుండగులు కత్తులతో దాడి చేయగా మహిళలు, చిన్నపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. రాములు కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం గుర్తుపట్టని విధంగా తయారైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదు: అమిత్ షా



Next Story

Most Viewed