- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : దారి దోపిడి దొంగలు బరితెగించారు. మహరాష్ట్రలోని శిరిడి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగివస్తున్న కుటుంబంపై దోపిడి దొంగలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక వాసీ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. తొలుత కారును అడ్డగించిన దొంగలు మారణాయుదాలతో విరుచుకపడ్డారు. బాధితుల నుంచి 8తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారును వేగంగా డ్రైవ్ చేయడంతో అదుపుతప్పి వాహనం బోల్తా కొట్టింది.
ఈ దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బండవేలికిచర్ల గ్రామానికి చెందిన రాములు కుటుంబంగా గుర్తించారు. దుండగులు కత్తులతో దాడి చేయగా మహిళలు, చిన్నపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. రాములు కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం గుర్తుపట్టని విధంగా తయారైంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.