గుంటూరు లో దారుణ హత్య.. రంగంలోకి డీఎస్పీ సుప్రజ

by  |
గుంటూరు లో దారుణ హత్య.. రంగంలోకి  డీఎస్పీ సుప్రజ
X

దిశ,వెబ్ డెస్క్:గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిథిలోని కొండా వెంకటప్పయ్యకాలనీ ప్రధాన రహదారిలో ఒక యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేసి హత్య చేసారు. గెలాక్సీ రెస్టారెంట్ అండ్ బార్ వద్ద స్నేహితులే గొడవ పడి… యువకుణ్ణి తలపై కొట్టడంతో ఆ యువకుడు చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీ సుప్రజ నగరం పాలెం పోలీసులతో కలిసి రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story