వ్యాపారి ఆత్మహత్య.. నర్సంపేటలో కలకలం

by  |
trader suicide
X

దిశ, నర్సంపేట టౌన్: కుటుంబ కలహాలతో ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నర్సంపేట పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… పట్టణంలోని శంకర్ ఎంటర్ ప్రైజెస్ యాజమాని కొత్త చంద్రప్రకాష్ పోస్ట్ ఆఫీస్ పక్కన గత కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కుటుంబ కలహాలతో చంద్రశేఖర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య శిరీష, కూతురు, కుమారుడు ఉన్నారు. విషయం తెలిసిన ఎస్ఐ రామ్ చరణ్ సంఘటనా స్థలానికి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Next Story