మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అది ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా..?

by  |
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అది ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రతిరోజు చేనేత, తెల్లని వస్త్రాలు ధరిస్తూ అప్పుడప్పుడు మెడలో టవల్ వేసుకొని కనిపించే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శీనన్న అందుకు భిన్నంగా తలపై టోపీ ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ప్రతిరోజు టోపీ ధరించి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ టోపీ వెనక ఉన్న మర్మం ఏమిటబ్బా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దిశ సేకరించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి శీనన్న తలపై లైట్ పురుగు కుట్టడంతో వెంటనే తల భాగంలో బొబ్బలు రావడం జరిగాయి. ఆ బొబ్బలు వచ్చిన చోట వైద్యులు వైద్యం చేశారు. ఆపై ఆయింట్ మెంట్ రాశారు. ఈ ఆయింట్మెంట్‌ను కొన్ని రోజులపాటు అప్లై చేసుకోవాలని డాక్టర్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా మంత్రి శీనన్న తలపై టోపీని ధరించి కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు తేలింది. ఇది మంత్రి శీనన్న టోపీ ధరించడం వెనుక ఉన్న మర్మం.

Next Story

Most Viewed