భారత్ మాతకు జై అంటూనే భారతీయులకు ద్రోహం చేస్తున్నారు: వికాస

by  |
భారత్ మాతకు జై  అంటూనే భారతీయులకు ద్రోహం చేస్తున్నారు: వికాస
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వంరగల్ జిల్లా ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో చేస్తున్న ఆందోళనకు విప్లవ కార్మిక సంఘం (వికాస) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన దీక్షకు అన్ని వర్గాలు కలిసి రావాలని వికాస కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వేలో అన్ని డివిజన్ల కంటే ఎక్కువ ఆదాయం కాజీపేట నుంచే వస్తుందన్నారు. ఈ డివిజన్ నుంచి 68.8 శాతం ఆదాయం వస్తుండగా అన్నింటికన్న ఎక్కువగా 12 వేల మంది ఉద్యోగులు ఇక్కడే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ నేటికీ ప్రారంభానికి నోచుకోలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐఐఆర్ చట్టంలోని 13వ షెడ్యూల్ లో 10వ అంశగా కోచ్ ఫ్యాక్టరీ కెటాయించినట్టుగా పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసేది లేదని తెగేసి చెప్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో మోడీ సర్కార్ భారత్ మాతకు జై అంటూనే భారతీయులకు ద్రోహం చేస్తున్నారన్నారు.

నిజమైన దేశభక్తుల తామేనంటూ సామ్రజ్యావాదులకు, బహుళజాతి సంస్థలకు కార్పోరేట్ శక్తులకు, నిరంకుశ బడా బూర్జువాలు అంబానీ, అదానిలకు దేశ సంపదను అమ్ముతున్న ఆసలైన ద్రోహులని ఆజాద్ మండిపడ్డారు. భారత రవాణా వ్యవస్థకు గుండెకాయలా ఉన్న రైల్వేను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న కుట్రను తిప్పి కొడుతూ, ఖాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకూ పోరాటం చేయాలని ఆజాద్ కోరారు.

Advertisement
Next Story

Most Viewed