ఎంపీ కవిత ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదం..

by  |
ఎంపీ కవిత ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదం..
X

దిశ,మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఫోటో ఉన్న ఫ్లెక్సీల ను గుర్తు తెలియని వ్యక్తులు తొలిగించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో బతుకమ్మ ఘాట్ కు వెళ్లే దారిలో ఎంపీ మాలోత్ కవిత వర్గీయులు, ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీ కవిత ఉన్న ఫ్లెక్సీలు తొలిగించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారే తొలిగించి ఉంటారని ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కాగా మానుకోట టీఆర్ఎస్ లో వర్గ భేదాలు నివ్వరుగుప్పిన నిప్పుల ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.


Next Story