దారుణం.. పాపం ఎవరి బిడ్డనో ఏమో..

by  |
దారుణం.. పాపం ఎవరి బిడ్డనో ఏమో..
X

దిశ,కంటోన్మెంట్ : అభం శుభం తెలియని పసి పాపను ఆటోలో వదిలి వెళ్లింది ఓ తల్లి. ఆడబిడ్డ అని అనుకున్నారో.. ఏమె తెలియదు.. పసిగుడ్డును అనాధను చేసి వెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న 31 నెంబర్ బస్ స్టాప్ వద్ద బుధవారం రాత్రి ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను నిలిపి మూత్రశాలకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి తన ఆటో వెనుక సీటులో ఓ రెండు, మూడు రోజుల పసి పాపాయి ఏడుస్తూ.. కనిపించింది. దీంతో పసిపాప కోసం ఎవ్వరైనా వస్తారేమోనని.. కొద్ది సేపు చూశాడు. ఎవ్వరు రాకపోవడంతో పోలీసులకు సమచారం అందించాడు. పోలీసులు ఖాజా, లక్ష్మణ్‌లు అక్కడికి చేరుకొని చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. అమీర్ పేటలోని శిశువిహార్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిన్నారిని అక్కడ ఎవ్వరు వదిలి వెళ్లారు అనేదానిపై చుట్టు పక్కల ఉన్న సీసీ పుటేజీలలో పరిశీలిస్తున్నారు.



Next Story

Most Viewed