భార్యను పది చోట్ల పొడిచిన భర్త..

by  |
knife
X

దిశ, వెబ్‌డెస్క్ : ములుగు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. విచక్షణ రహితంగా పొడవడంతో ఆమె త్రీవంగా గాయపడింది. వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాకా సంధ్యను ఆమె భర్త కొద్ది రోజులుగా అనుమానిస్తూ.. ఘర్షణ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సంధ్యపై భర్త కత్తితో దాడికి దిగాడు. సంధ్యను పది చోట్ల పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.



Next Story

Most Viewed