ఎందుకోసమో తెలియదు.. ఓ యువతి ఆత్మహత్య!

by Disha Web Desk 13 |
ఎందుకోసమో తెలియదు.. ఓ యువతి ఆత్మహత్య!
X

దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా వెంకట‌పురం మండ‌లం చ‌ర్చిపేట గ్రామానికి చెందిన ఓ యువ‌తి పురుగుల మందు తాగి ఆత్మహ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మంగళవారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. చ‌ర్చిపేట గ్రామానికి చెందిన కోళ్ల రాంబాబు చిన్న కూతురు లావ‌ణ్య(18) ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహ‌త్యకు పాల్పడింది. ఇది గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంక‌ట‌పురం ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికే లావ‌ణ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గం మ‌ధ్యలో మృతి చెందింది. లావ‌ణ్య మృతి చెంద‌డానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed