ఈనెల 28న నెల్లూరుకు సీఎం జగన్.. సభ ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నేతలు

by Disha Web |
ఈనెల 28న నెల్లూరుకు సీఎం జగన్.. సభ ఏర్పాట్లను పరిశీలించిన వైసీపీ నేతలు
X

దిశ, ఏపీ బ్యూరో : దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఈనెల 28న నెల్లూరులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సంతాపసభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ హాలులో జరుగుతున్న ఏర్పాట్లు, పరిసర ప్రాంతాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కలిసి పరిశీలించారు. సంతాప సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పార్కింగ్, సీటింగ్, భోజన సదుపాయాలు, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, ఏఎస్పీ వెంకటరత్నం, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్‌లు ఉన్నారు.

Next Story