మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: విశాల్

by Dishanational1 |
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: విశాల్
X

దిశ, కుత్బుల్లాపూర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని యువ నేస్తం ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ యువజన నాయకులు కేపీ విశాల్ గౌడ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని భూమిరెడ్డినగర్ లో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బుధవారం బహుమతులు అందజేశారు. రాజకీయంగా, ఆర్ధికంగా, వ్యాపారరంగాల్లో రాణిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బల్వంత్ రెడ్డి, పెద్ది మల్లేశం, భూపాల్ రెడ్డి, సంతోషి, సదాలక్ష్మి, సత్తిరెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed