- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'మాకు ఉద్యోగాలు ఇవ్వకుంటే పనులు అడ్డుకుంటాం'
by GSrikanth |

X
దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 5వ ఇంక్లైన్లోని ఓసీపీ-5 పీసీ పటేల్ కంపెనీ ఆఫీస్ ఎదుట నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఓసీపీ-5 ప్రారంభం కావడంతో 12వ డివిజన్ ప్రజలు దుమ్ము ధూళితో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. పక్కనే ఉన్న తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడంపై 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత భర్త టీఆర్ఎస్ నాయకులు రవీందర్తో పాటు నిరుద్యోగులు కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. పీసీ పటేల్ కంపెనీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. స్థానిక డివిజన్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కల్పించకుంటే పనులను అడ్డుకుంటామని బొడ్డు రవీందర్ హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
Next Story