- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రాణం తీసిన సరదా.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం..

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్దెన్నా వాగు ప్రాజెక్టు నీటిలో మునిగి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. భైంసా పట్టణంలోని కుంట ఏరియా ప్రాంతానికి చెందిన ఆరుగురు మిత్రులు సోమవారం మధ్యాహ్నం గడ్డేన్న వాగు ప్రాజెక్ట్ వద్దకు విహారం కోసం వెళ్లారు. ప్రాజెక్టు వద్ద ఉల్లాసంగా కాలం గడువుతున్న వీరు.. అక్కడే జాలర్లు చేపలు పట్టే ప్రక్రియను చూసేందుకు లోపలి వైపు వెళ్లారు. ఈ సమయములో ప్రమాదవశాత్తు సయ్యద్ సోహెల్ (20) అనే యువకుడు కాలు జారి నీటిలో పడ్డాడు. దీనితో ఆయన వెనుకే ఉన్న సయ్యద్ ఫెరోజ్ (20) నీట మునుగుతున్న మిత్రుడి చేయినందుకుని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమములో ఆయన కూడా అదుపుతప్పి నీట మునిగిపోయాడు. ఇద్దరు మిత్రులు నీట మునిగి పోతుండటాన్ని గుర్తించిన మిగతా మిత్రులు కాపాడేందుకు ప్రయత్నం చేయగా అది విఫలం అయింది. రక్షించండి అంటూ కేకలు పెట్టడముతో జాలర్లు, ఇతరులు వచ్చి యువకులిద్దరిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. నీట మునిగిన ఇద్దరిని బయటకు తీసి చూసే సమయానికి చనిపోయి ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.