- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి సంపులో పడి చిన్నారి మృతి
by Batti.Sumithra |
తిరుమలాపురం గ్రామానికి చెందిన కంచు బీరన్న–మౌనిక దంపతుల కుమార్తె అన్వి (2) నీటి సంపులో పడి మృతి చెందింది.

X
దిశ, చిట్యాల : మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన కంచు బీరన్న–మౌనిక దంపతుల కుమార్తె అన్వి (2) నీటి సంపులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అన్వి తోటి పిల్లలతో ఆడుకుంటుండగా నీటి సంపులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో చిన్నారిని బయటికి తీసే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story






