- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మద్యం తాగితే భారతీయులు కాదు: సీఎం సంచలన వ్యాఖ్యలు

పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు నకిలీ మద్యపానం పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, మద్యం తాగే వారు భారతీయులు కాదని అన్నారు. వారిని మహాపాపిలని సంభోదించారు. విషపూరితమైన మద్యం సేవించి మరణించిన వారికి ప్రభుత్వం పరిహారాన్ని ఇవ్వలేదని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. 'మద్యం తాగే వారిని నేను భారతీయులుగా పరిగణించను. మద్యం సేవించడం హానికరం అని తెలిసినా కొందరు వినియోగిస్తున్నారు. తర్వాత పరిణామాలకు వారే బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు' అని చెప్పారు. కాగా, బుధవారమే బీహార్ అసెంబ్లీ మద్యపాన నిషేధ బిల్లు-2022 బిల్లు(సవరణ)కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం సేవించడం పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే, దీనికి కొన్ని మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం మద్యం అమ్ముతూ లేదా సేవిస్తూ ఎవరైనా పట్టుబడితే ఎక్సైజ్ కోర్టుకు పంపనున్నారు.