Governor Tamilisai: రైలులో భద్రాద్రి వెళ్లడం ఆనందంగా ఉంది: గవర్నర్

by Disha Web |
Governor Tamilisai: రైలులో భద్రాద్రి వెళ్లడం ఆనందంగా ఉంది: గవర్నర్
X

దివ, వెబ్ డెస్క్: గవర్నర్ తమిళిసై రెండు రోజుల పాటు భద్రాచలంలో పర్యటించనున్నారు. దీంతో ఆమె ఆదివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోగిలో భద్రాచలం వెళ్లారు. అంతకుముందు రైల్వే స్టేషన్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇలా రైలులో భద్రాచలం వెళ్లడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

కాగా, సోమవారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో తమిళిసై పాల్గొంటారు. ఆ తర్వాత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే గిరిజన మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు హాజరవుతారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రాన్ని సందర్శిస్తారు. దాంతోపాటు రెడ్ క్రాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ పనితీరును సమీక్షించనున్నారు. తర్వాత దమ్మాయిపేట మండలం నాచారంలోని జగదాంబసహిత జయలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. చివరి రోజు మంగళవారం ఆమె జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి ఆవాసాలకు చెందిన గిరిజన సముదాయాలను సందర్శిస్తారు. అంతేకాకుండా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం మణుగూరులోని భారీ వాటర్‌ప్లాంట్‌ను పరిశీలిస్తారు.

Next Story

Most Viewed