- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రాణం తీసిన అతివేగం.. అక్కడికక్కడే బాలుడు దుర్మరణం..
by Satheesh |

X
దిశ, మంథని: మితిమీరిన వేగంతో వెళ్తూ.. బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన నారమల్ల ఆశిష్, గంగాపూరికి చెందిన జంజర్ల సాయి చరణ్ బైక్పై గంగాపురికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ మూల మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న నారమల్ల ఆశిష్ (17) అక్కడికక్కడే మరణించగా.. సాయిచరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్ర కుమార్ తెలిపారు.
Next Story