4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం..

by Disha Web Desk 13 |
4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం..
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అభం శుభం తెలియని ఓ నాలుగో తరగతి చిన్నారిపై ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే.. జిల్లా కేంద్రంలో 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులు లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలిక ఇంటికి వెళ్లి కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. దీంతో చిన్నారి కేకలు వేయగా ఆ కీచకుడు పరుగులు తీశాడు. ఆ చిన్నారి వెంటనే జరిగిన విషయాన్ని బంధువులకు తెలిపి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించింది. వెంటనే బాధిత చిన్నారిని బాల రక్ష భవన్‌కి తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు.

విచారణ చేస్తున్నాం.. సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నాగ వాణి

ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాలికను చేరదీశాం. అలాగే పోలీసులకు సమాచారం అందించాం.. ఈ విషయంపై విచారణ వేగవంతం చేసి బాలల హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.



Next Story

Most Viewed