సక్సెస్ సెలబ్రేషన్స్.. ఛార్మీతో కలిసి ఛిల్ అవుతున్న రౌడీబాయ్

by Disha Web |
సక్సెస్ సెలబ్రేషన్స్.. ఛార్మీతో కలిసి ఛిల్ అవుతున్న రౌడీబాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషల్‌లో వస్తున్న తాజా చిత్రం 'లైగర్'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించగా.. విజయ్‌కి తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, సాంగ్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ట్రీట్ ఇస్తూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది.

దీంతో ఇండియాను నిజంగానే షేక్ చేశాడు విజయ్. దాంతో లైగర్ మూవీ టీమ్ ఫుల్ ఖుషి అవుతునట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, ఛార్మీతో కలిసి ఛిల్ అవుతున్న ఫొటో స్వయంగా ఛార్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed