- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాక్ మార్కెట్స్: నిన్నటి నష్టాల నుంచి కోలుకొని లాభాల వైపు పరుగులు
స్టాక్ మార్కెట్లలో రికవరీ జోరు! నిన్నటి పతనం తర్వాత నేడు లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. సెన్సెక్స్ 425 పాయింట్లు పెరిగి 77,991 వద్ద ట్రేడింగ్.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కేట్లు (Stock markets) గత కొద్ది రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. కానీ గత సెషన్లో భారీ పతనంతో ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసిన భారతీయ స్టాక్ మార్కెట్లు, నేడు (మంగళవారం) ఉదయం నుంచే రికవరీ బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు, కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం మార్కెట్లకు భారీ ఊతాన్నిచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 77,991 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ, సుమారు 425 పాయింట్ల లాభంతో బలంగా కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా తన కీలక స్థాయిలను తిరిగి పుంజుకుని 24,139.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లలో ఆశలు చిగురింపజేస్తోంది.
నేటి మార్కెట్ గమనానికి ప్రధానంగా ఐటీ (IT), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు వెన్నుదన్నుగా నిలిచాయి. నిన్నటి భారీ నష్టాల తర్వాత నాణ్యమైన షేర్ల ధరలు ఆకర్షణీయంగా మారడంతో దేశీయ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టారు. దీనికి తోడు అమెరికా, ఇతర ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణి కూడా మన మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మార్కెట్లు మరింత లాభాల్లో ముగిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






