కామారెడ్డి మండలంలో విషపూరిత ఆహారం తిని గొర్రెలు మృతి

by Disha Web |
కామారెడ్డి మండలంలో విషపూరిత ఆహారం తిని గొర్రెలు మృతి
X

దిశ, కామారెడ్డి రూరల్ : రోజు మాదిరిగానే మేతకు వెళ్లిన గొర్రెల మందలోని 10 గొర్రెలు విష ఆహారం తినడంతో గొర్రెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం దేవుని పల్లికి చెందిన నాగళ్ళ గంగయ్య గొర్రెల మంద శనివారం విష ఆహారం తినడంతో అస్వస్థతకు గురయ్యాయి. వాటికి చికిత్స నిర్వహించగా అందులోని పది గొర్రెలు మాత్రం ఆదివారం మృత్యువాత పడ్డాయి. చనిపోయిన గొర్రెలకు పశు వైద్యుడు రవి కిరణ్ పోస్టుమార్టం నిర్వహించి పరీక్షించగా ఎవరో మిగిలిపోయిన ఆహారం పడవేయడంతో దానిని తిని అరగక అస్వస్థతకు గురై మృత్యువాత పడినట్టు పేర్కొన్నారు. దీంతో బాధిత రైతుకు సుమారు లక్ష వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed