ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే వెలసిన గుడిసెలు.. మళ్లీ మొదటకొచ్చిన సమస్య

by Javid Pasha |

దిశ, వర్థన్నపేట: వర్థన్నపేటలోని ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గుడిసెలు వెలిశాయి. ఇళ్లు లేని పేదలకు.. Latest Telugu News..

ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే వెలసిన గుడిసెలు.. మళ్లీ మొదటకొచ్చిన సమస్య
X

దిశ, వర్థన్నపేట: వర్థన్నపేటలోని ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గుడిసెలు వెలిశాయి. ఇళ్లు లేని పేదలకు సొంత ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని సర్వే నెంబర్ 1624ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే చిరలతో గుడిసెలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ సమస్య తీరుస్తానని ఆందోళనకారులకు హామీ ఇచ్చి విరమించారు. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా తమ సమస్య పరిష్కరించడం లేదని మరోమారు దళితులు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.



Next Story