- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీడీపీ యువ ఎంపీ కూతురికి చాక్లెట్ ఇచ్చిన ప్రధాని మోడీ

దిశ, వెబ్డెస్క్: టీడీపీ కీలక నేత, పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీని కలిశారు. మంగళవారం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమార్తెను చూసిన ప్రధాని ముద్దాడారు. చక్కగా ఉంది అంటూ పొగుడుతూ.. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. అంతేగాక, రామ్మోహన్ నాయుడు కూతురుని ప్రధాని మోడీ ఆశీర్వదించారు. కాగా, ప్రధాని తమ కుటుంబాన్ని రిసీవ్ చేసుకున్న విధానంపై ఎంపీ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. అనంతరం ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో పార్టీ ఎంపీలకు మోడీ కీలక సూచనలు చేశారు. ప్రజాసేవ కోసం బీజేపీ ఎంపీలందరూ జీవితాలను అంకితం చేయాలని చెప్పారు.
Pleased to have met Hon'ble PM @narendramodi ji for a courtesy visit. pic.twitter.com/bcyMQ4HUXr
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) April 5, 2022