పీడీఎస్ బియ్యం పట్టివేత

by Disha Web Desk 13 |
పీడీఎస్ బియ్యం పట్టివేత
X

దిశ, కామారెడ్డి రూరల్: ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 19.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్ శివారు కల్కినగర్ లో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజిరెడ్డి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని అధికారులు బుధవారం రాత్రి పట్టుకుని వాటిని సీజ్ చేశారు. గురువారం పట్టుకున్న బియ్యానికి పంచనామా నిర్వహించారు. అనంతరం బియ్యాన్ని గోదాముకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్ఓ రాజశేఖర్ మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed