మెగా అభిమానులకు గుడ్ న్యూస్..

by Disha Web |
మెగా అభిమానులకు గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే తమ కెరీర్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నారు. తమ సినిమాల హైప్ కోసం సీనియర్ మెగా సపోర్ట్‌ల మద్దతు అవసరం లేని సూపర్ స్టార్‌లుగా ఎదిగారు. అయితే పెద్ద మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన కెరీర్‌లో ఇప్పటికే కొన్ని మంచి హిట్ చిత్రాలను సొంతం చేసుకున్నాడు. అయితే మరోవైపు వైష్ణవ్ తేజ్ వంటి ఇతర మెగా హీరోలు ఇండ్రస్ట్రీలో అడుగులు పెట్టడానికి ఇప్పటికీ కష్టపడుతున్నారు.

సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' విడుదలకు ముందు బైక్ ప్రమాదాన్ని ఫేస్ చేసిన తర్వాత ఇంకా క్లోసెట్ నుండి బయటకు రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం వినోదయ సీతం రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ రాస్తున్నారు.

ఇక వైష్ణవ్ తేజ్ కోసం దర్శకుడు సుధీర్ వర్మ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. దీంతో పవన్ మేనల్లుళ్లిద్దరిని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ తన మేనల్లుళ్లకు సహాయం చేయడం, వారి సినిమాల్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు టాక్. మరోవైపు అభిమానులు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed